top of page

అన్నదమ్ముల రాశులు

#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపు వెంకటసుబ్బయ్య, #అన్నదమ్ములరాశులు, #AnnadammulaRasulu, #TeluguMoralStories, #నైతికకథలు


Annadammula Rasulu - New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah

Published In manatelugukathalu.com On 06/04/2025

అన్నదమ్ముల రాశులు - తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



చాలా కాలం క్రితం కడప జిల్లా మైదుకూరు ఫిర్కా, లంకమల అడివికి సమీపాన తూర్పు కనుమల్లో ఉన్న అన్నలూరు గ్రామంలో శివచంద్రయ్య చంద్రమ్మ దంపతులకు ఉమేశ్చంద్రుడు హేమచంద్రుడు చంద్రబింబం లాంటి ఉత్తములైన ఇద్దరు కొమరులు జన్మించారు. ఈ ఇద్దరి అన్నదమ్ములకు ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం అనురాగం. తమ్ముడంటే అన్నకు అలవికాని ప్రేమ, అన్నంటే ఎనలేని గౌరవం తమ్ముడికి. అన్నదమ్ములు ఇద్దరు ఒద్దికగా పెరిగి పెద్దైయ్యారు. రుష్యాశ్రమములో ఉంటూ గురుకులంలో వ్యవసాయాంశంలో చదివి వ్యవసాయరంగంలో నిష్ణాతులైయ్యారు. 


కొడుకులకు యుక్తవయసు రాగానే తగిన కన్యలను వెదికి వివాహం జరిపించాడు తండ్రి శివచంద్రయ్య. వివాహంతో పాటు కొడుకులిద్దరికి సమానంగా ఆస్తులను, భూములను పంచి యిచ్చి వేర్వేరుగా కాపురాలు పెట్టించాడు శివచంద్రయ్య. 


పేరుకే వేర్వేరు కాపురాలు గానీ, అన్ని కలిసే అనుభవిస్తూ, కలిసే నిర్ణయాలు తీసుకుంటూ, కలిసికట్టుగా వ్యవసాయం చేసుకుంటూ, ఏ పొరపొచ్చాలు రాకుండా ఆనందంగా జీవించసాగారు అన్నదమ్ములు ఉమేశ్చంద్రుడు హేమచంద్రుడు. 


ధార్మిక కార్యక్రమాల్లో, న్యాయపరమైన విషయాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహణలో, సేవా కార్యక్రమాల్లో గ్రామ ప్రజలతో కలిసి ముందు వరుసలో అన్నదమ్ములిద్దరూ నిలబడే నిర్వర్తించేవారు. ప్రజల అభిమానానికి పాత్రులైయారు. 


కాలం గడిచే కొద్దీ తమ్ముడు హేమచంద్రుడికి పిల్లలు పుట్టారు. అన్న ఉమేశ్చంద్రుడికి పిల్లలు పుట్టలేదు. అయినా తమ్ముడి పిల్లలే తన పిల్లలుగా భావించి ఉమేశ్చంద్రుడు సంతోషంగా జీవిస్తున్నాడు. 


తమ్ముడి ఇంట్లో ధాన్యం అయిపోతే అన్న ఇంట్లో ధాన్యం వాడుకొనేవాడు హేమచంద్రుడు. అన్న ఇంట్లో ఏవైనా నిత్యావసర వస్తువులు తక్కువైతే తమ్ముడు ఇచ్చేవాడు. ఇలా ఇచ్చిపుచ్చుకుంటూ, పంటలు పండించుకుంటూ వ్యవసాయమే వృత్తిగా కాలం గడుపుతున్నారు అన్నదమ్ములిద్దరు. 


ఒక సంవత్సరం వానలు బాగా కురిసి పంట ఇబ్బడి ముబ్బడిగా పండింది. పొలాలోనే కల్లాలు ఏర్పాటు చేసికొని పంటను కోసి, పంట చెత్త నంతా కల్లాలకు చేర్చారు. వరి చెత్తను రాలగొట్టి వరి ధాన్యం రాశులు పోశారు. 


అన్నదమ్ముల వరి ధాన్యం రాశులు కొండల్ని తలపించాయి. పగలంతా పని చేయడంవల్ల అలసిపోయి అన్నదమ్ములు ఇద్దరు పొలాల్లో ధాన్యపు రాశుల దగ్గరే ఆ రాత్రి నిద్రపోయారు. 

తొలి జాములో అన్న సద్దు చేయకుండా నిద్ర మేలుకొని "తమ్ముడు పిల్లలు కలిగినవాడు. ధాన్యం తమ్ముడికే ఎక్కువ ఉండాలి. నేను సంతానం లేనివాన్ని. నాకేందుకు ఇంత ధాన్యం" అని తలచి తన రాశి నుంచి పది పుట్లు ధాన్యం తమ్ముడి రాశిలో ఎత్తి పోశాడు ఉమేశ్చంద్రుడు. 


మలి జాములో తమ్ముడు చప్పుడు లేకుండా నిద్రలేచి "అన్న దగ్గర ఉన్న ధాన్యాన్ని మేమే తింటున్నాం. కాబట్టి ధాన్యం అన్న దగ్గర ఉండడమే న్యాయం" అని యోచించి తన ధాన్యపు రాశిలోంచి పది పుట్లు ధాన్యం ముంచి అన్న ధాన్యపు రాశిలో పోశాడు హేమచంద్రుడు. 


మూడోవ జాములో అన్న ఉమేశ్చంద్రుడు మరోసారి మేలుకొని "తమ్ముడి కుటుంబం పెద్దది. సంవత్సరం పొడుగునా ధాన్యం తమ్ముడికి సరిపోతుందో లేదో" అని భావించి తన ధాన్యపు రాశి నుంచి పది పుట్లు ధాన్యాన్ని తోడి తమ్ముడి రాశిలో పోశాడు. 


నాలుగోవ జాములో తమ్ముడు హేమచంద్రుడు ఇంకోక్కసారి లేచి " ధాన్యం అన్న దగ్గర ఉన్నా అనుభవించేది మేమే కాబట్టి ధాన్యం అన్న దగ్గర ఉండడమే మంచిది" అని ఆలోచించి తన రాశి నుంచి అన్న రాశిలో ఇంకో పది పుట్టు ఎత్తిపోశాడు.


అలా రాత్రంతా అన్న తరువాత తమ్ముడు, తమ్ముడు తరువాత అన్నా నిద్ర మేలుకొని ఒకరి రాశిలోంచి మరొకరి రాశిలోకి ధాన్యం ఎత్తిపోసుకున్నారు. రాశులు తరగనూ లేదు పెరగనూ లేదు. 


ఈ ఉదంతానంతా తదేక దృష్టితో పరిశీలించి వీక్షిస్తున్న భగవానుడు, ఆ అన్నదమ్ముల అసాధారణమైన త్యాగనిరతికి మురిసి, అపరిమిత భ్రాతృప్రేమకు మెచ్చి వారి పరస్పర అనన్యమైన ఆత్మీయ అనురాగాలకః శాశ్వత గుర్తుగా ఆ రెండు ధాన్యపు రాశులను రెండు కొండలుగా మార్చాడు. ఆ రెండు కొండల్ని జనం "అన్నదమ్ముల రాశులు" అని పిలుచుకున్నారు. 


అన్నదమ్ముల అనుబంధానికి సాక్షిగా, ఆ కొండలు తరతరాలుగా జనస్ఫూర్తిగా నిలిచాయి. అన్నదమ్ముల రాశులుగా వాసికెక్కి ప్రజారాధనా పాత్రమైనాయి. 


మనుస్పర్థలతో విడిపోయిన అన్నదమ్ములు, అన్నదమ్ముల రాశుల నుంచి ప్రేరణ పొంది స్పర్థలు మాని గాఢ అనురక్తితో కలుస్తుంటారు.


అన్నదమ్ములకే కాదు ఆ కొండలు తొబుట్టువులందరి ఆత్మీయతా సంకేతాలు. ప్రేమ చిహ్నాలు. అభిమానానికి హేతువులు. అనురాగానికి ప్రతీకలు. 


ప్రతి ఉదయం సూర్యుడు ఈ అన్నదమ్ముల రాశుల మధ్యనే ఉదయించి, అన్నదమ్ముల ఆదర్శ బంధాన్ని లోకానికి చాటుతున్నాడు. 


రాండి జనులారా! ఆ అన్నదమ్ముల రాశుల కొండల్ని చూపిస్తాను!

 -------


కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య

చదువు: B.com

పుట్టిన తేది: 1960

తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య

రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.

అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.

సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.

---------

Comentarios


bottom of page