top of page

 దీక్ష

#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #Deeksha, # దీక్ష, #TeluguKathalu, #తెలుగుకథలు


Deeksha - New Telugu Story Written By - Palla Venkata Ramarao

Published In manatelugukathalu.com On 11/04/2025

 దీక్ష - తెలుగు కథ

రచన: పల్లా వెంకట రామారావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



మాధవరంలో ఉండే గోవిందుడు ధనవంతుడే కాక దానపరుడు కూడా. తనకు తోచిన సహాయాలు

చేస్తూ ఊరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే అతనిలో ఒక లోపం, మద్యానికి బానిస అయ్యాడు. స్నేహితుల ప్రోద్భలంతో మొదలై ఇప్పుడు మహమ్మారిలా పీడిస్తోంది. ఆ స్నేహితులు దూరమయ్యారు కానీ ఈ వ్యసనం దూరం కాలేదు. ఎన్నోసార్లు ప్రయత్నించాడు కానీ మానలేకపోతున్నాడు. సాయంత్రం అయ్యేసరికి దానిపై మనసు పోతోంది.


ఈ విషయాన్ని గురించి ఎప్పుడూ భార్య వద్ద ప్రస్తావించేవాడు. అతని భార్య కూడా ఎన్నో ఉపాయాలు ఆలోచించింది కానీ ఏవీ సఫలం కాలేదు. విసుగెత్తి చివరకు ఒక మాట అంది "మన ఊరి కి పెద్ద దిక్కు జ్ఞానానంద స్వామి 

ఉన్నారు కదా! ఆయన మీదే భారం వేయండి".


దానికి గోవిందుడు "నాకూ ఈ ఆలోచన రాకపోలేదు కానీ ఆయన ఎదుటపడి చెప్పే ధైర్యం లేక ఆగిపోయాను. ఆయనకు నామీద ఉన్న మంచి అభిప్రాయాన్ని చెడగొట్టుకున్నట్లు అవుతుంది కదా అని వెళ్లలేకపోతున్నా" అన్నాడు.


"ఇంటి గుట్టు, వ్యాధి రట్టు అన్నారు. మీరిలా ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల సమస్య మరింత ముదిరి పోతుంది కానీ పరిష్కారం దొరకదు. ఇప్పటి వరకు అయిన ఆలస్యం చాలు. వెంటనే వెళ్ళండి" అంది. 


తల ఊపాడు గోవిందుడు.


జ్ఞానానంద స్వామి ఊరి చివర ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడమే కాక ఊరి ప్రజలకు ఎన్నో విషయాలలో చేదోడువాదోడుగా ఉంటారు. గోవిందుడు వెళ్లి తన సమస్యను వివరించాడు.


అంతా విన్నాక ఆయన కాసేపు మౌనం వహించాడు. తర్వాత ఏదో ఆలోచన వచ్చి నవ్వుతూ "రేపు నువ్వు ఇదే సమయానికి ఆశ్రమానికి రా. నీకు మీ ఇలవేల్పు వేంకటేశ్వరుని పేరుపై దీక్ష ఇస్తాను. నువ్వు నెలరోజుల పాటు దీక్షలో ఉండాలి. నీకు సమ్మతమేనా?" అని అడిగాడు స్వామి. 


"మీరు చెప్పాక ఎలా కాదంటాను? దీక్ష వహిస్తా" నన్నాడు గోవిందుడు.


మరుసటి రోజు నుంచి దీక్ష కొనసాగింది. దీక్షలో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం ఆశ్రమానికి వచ్చి తన వద్ద ఉండమనేవాడు స్వామి. అలా నెలరోజులు దీక్షను దిగ్విజయంగా పూర్తి చేసి ఏడుకొండల స్వామిని దర్శించి ఆనందంగా ఆశ్రమానికి వచ్చాడు గోవిందుడు. 


"ఏం గోవిందా!ఎలా ఉందిప్పుడు?" ప్రశ్నించాడు స్వామి.


"మద్యం పై కోరిక. పూర్తిగా నశించి పోయింది స్వామీ!" సంతోషంగా బదులిచ్చాడు గోవిందుడు ప్రసాదం అందిస్తూ.


"సరే మంచిది. ఇకనుంచి వారంలో రెండు రోజులు ఆశ్రమానికి వస్తూండు " షరతు విధించాడు స్వామి. 


సరేనంటూ ఆశీర్వాదం తీసుకుని వెళ్లిపోయాడు గోవిందుడు. 


ఇదంతా మొదటి నుంచి గమనించిన స్వామి వారి ప్రథమశిష్యుడు ఆశ్చర్యంతో అడిగాడు "స్వామీ! ఎన్నో రోజుల నుంచి దూరం కాని ఆ వ్యసనం నెలరోజుల లోనే ఎలా దూరమైంది. అందులోనూ మీరతనికి ఏ మందూమాకూ ఇవ్వలేదు. కేవలం సాయంత్రం పూట మీవద్ద కూర్చోబెట్టుకున్నారంతే. ఏం మాయ చేశారో అర్థం కావడంలేదు".


"మాయ లేదు మర్మం లేదు. ఇదంతా మనసు చేసే గారడీ, గోవిందుడు జీవితంలో స్థిరపడిన వ్యక్తి. ఏ పనీ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ముఖ్యంగా సాయంత్రం పూట తీరిగ్గా ఉండబట్టి మనసు మద్యం వైపు లాగుతోంది.


అందుకే నేను ఆ సమయంలో ఎక్కడికీ వెళ్లకుండా నా వద్ద కూర్చోబెట్టుకుని ధ్యానం చేయించాను. ఏ పనైనా ఇరవై ఒక్క రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే అది అలవాటుగా స్థిరపడిపోతుంది. అలా ఆశ్రమానికి రావడం, ధ్యానం చేయడమన్నది అతనికి ఒక కొత్త అలవాటుగా మారింది. పాత అలవాటు నశించింది. మళ్లీ అది తిరిగి అలవాటు కాకుండా వారానికి రెండుసార్లు రమ్మని చెప్పాను. అర్థమైందా?" నవ్వుతూ వివరించాడు స్వామి.


రెండు చేతులూ జోడించాడు శిష్యుడు.

 ---------- 

పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు

Profile Link:


జన్మస్థలం:     ప్రొద్దుటూరు, కడప జిల్లా. 

జననం:         1974 

తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ

చదువు:        ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)

ఉద్యోగం:       స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) 

అభిరుచి:      సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్)  travel India telugu     

                    (యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)

రచనలు:  'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,

                   వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,

                   బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల

                   ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల

                   బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

 సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం

                    మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ      

                    కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా 

                    రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ 

                    వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.

Comments


bottom of page