top of page

క్షీరసాగర మథనము - 8

Writer's picture: T. V. L. GayathriT. V. L. Gayathri

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 8 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 11/02/2025

క్షీరసాగర మథనము - 8 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి



ఇక క్షీరసాగర మథనము - 8 చదవండి..


58.

తేటగీతి.


ఇట్లు స్తుతియించు నమరుల నెఱిగి నట్టి

ఫాలనేత్రుండు కరుణతో ప్రాపు నిడుచు

జగము శ్రేయములన్ గోరి సంతసముగ

పార్వతివదనంబును గని పలికెనిట్లు.//


తాత్పర్యము :


ఇట్లు దేవతలు స్తుతి చేయగా, పరమశివుడు వారలను కరుణించి, రక్షణనిడుచు, పార్వతీదేవిని చూస్తూ ఇలా అన్నాడు.//


59.

తేటగీతి.


'దీనమౌ స్థితి నొందిరి దేవగణము

విశ్వమంతయు క్రుంగెనీ విషము వలన

వీరి కష్టమున్ బోద్రోలి వెఱపు మాన్పి

మేలు సేయంగ వలయును మిక్కుటముగ.//


తాత్పర్యము :


దేవతలు చాలా దీనమైన స్థితిని పొందారు.విషము వలన ఈ జగత్తు అంతా భయముతో క్రుంగిపోయింది. వీరి భయాన్ని పోగొట్టి మనము వీరికి మేలు చెయ్యాలి!//


60.

తేటగీతి.


మాయలో బడి లోకులు మఱతు రెపుడు

దైవ నామమున్ మరి యేది దారి తెన్ను?

మాయను సృజించు వాడగు మహితశక్తి

విష్ణుమూర్తికి తెలియని విధియె కలదె?//


తాత్పర్యము :

మనుషుల హృదయంలో మాయ క్రమ్ముకొనటం వలన, వాళ్ళు దైవనామమును పలకటం మరచిపోతారు. వీరు బాగుపడటానికి వేరే దారే లేదు కదా!ఆ మాయను సృష్టించువాడే శ్రీహరి. అతనికి తెలియని కార్యం ఏమైనా ఉంటుందా? (ఉండదు అని భావం )//




టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




40 views0 comments

Comments


bottom of page