top of page

మప్పుకుంటే తిప్పుకోలేము

Writer's picture: Patrayudu Kasi ViswanadhamPatrayudu Kasi Viswanadham

#PatrayuduKasiViswanadham, #పట్రాయుడుకాశీవిశ్వనాథం, #MappukunteTippukolemu, #మప్పుకుంటేతిప్పుకోలేము, #పిల్లలకథలు, #TeluguChildrenStories, #తెలుగుజాతీయాలు

Mappukunte Tippukolemu - New Telugu Story Written By Patrayudu Kasi Viswanadham

Published In manatelugukathalu.com On 21/02/2025

మప్పుకుంటే తిప్పుకోలేము - తెలుగు కథ

రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



వినీల, వినీత్ భార్యాభర్తలు. వారి కొడుకు పేరు నియాన్. వాడికి రెండున్నరేళ్ళు. అల్లరిచేయడంలో దిట్ట. ఇల్లంతా నీళ్ళు ఒంపడం, గుడ్డపెట్టి రాయడం, వస్తువులన్నీ పగలగొట్టడం చేస్తూ ఉంటాడు. 


కొడుకు వస్తువులు పాడుచేసినా వినీల పట్టించుకునేది కాదు. వాడు అల్లరి పెట్టకుండా ఉండడం కోసం చరవాణిలో "చిట్టి చిలకమ్మా అమ్మకొట్టిందా" లాంటి యానిమేషన్ వీడియోలు చూపించేది. అలా బాల గేయాలతో పాటు సినిమా పాటలు కూడా చూసేవాడు.


రాను రాను వాడు చరవాణికి బాగా అలవాటు పడ్డాడు. కొన్నాళ్ల తరువాత నియాన్ని బడిలో చేర్పించారు. అక్కడ తోటిపిల్లలతో కలసి ఉండటం, చదవడం, రాయడం నేర్చుకోవడం నియాన్ కి కష్టంగా ఉండేవి. 


చరవాణి లేకపోవడంతో బడికి వెళ్లనని మారాం చేసేవాడు. కొడుకుని బ్రతిమాలి బడికి పంపేవారు. అయినా తరచూ బడికి గైర్హాజరు అయ్యేవాడు. చదువు మీద శ్రద్ద పెట్టేవాడు కాదు. ఖాళీ దొరికినప్పుడల్లా వీడియో గేమ్స్ ఆడుకునేవాడు. 


ఈ విషయం తెలుసుకున్న నియాన్ తాత రాజారావు కొడుకు ఇంటికి వచ్చాడు.


“మప్పుకుంటే తిప్పుకోలేమని ఊరికే అనలేదు పెద్దలు” అన్నాడు.


“నేనేమీ మప్పలేదు” అంది కోడలు కోపంగా.


“పూర్వం ఒక పల్లెటూళ్ళో ఆదమ్మ, ఆదయ్య దంపతులు నివసించేవారు. వారు కడు పేదవారు. ఒకరోజు వారి ఇంటి దగ్గరలో ఒక కుక్కపిల్ల తల్లి కోసం అరుస్తూ కనిపించింది. ఆదయ్యకి జాలివేసింది కాసిన్ని పాలు పెట్టాడు.

తోక ఊపుతూ ఆదయ్య చుట్టూ తిరగసాగింది. అలా ఆదయ్యకి కుక్క పిల్ల ప్రాణం అయ్యింది. 


కొన్నాళ్ళకు పెరిగి పెద్దది అయ్యింది. ఆదయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాలే వెళ్ళేది. ఆదయ్య మంచం మీద పడుకునేది. కుక్కని గొలుసుతో కట్టి ఉంచమని ఆదమ్మ ఎన్నిసార్లు చెప్పినా ఆదయ్య వినిపించుకునే వాడుకాడు. 


“కుక్క మన కుటుంబంలో ఒక భాగం” అనేవాడు. ఒకసారి ఆదమ్మ మీదకు దాడి చేసి గాయ పరిచింది కుక్క. దాంతో ఆదయ్యకు చాలా కోపం వచ్చింది. కుక్కని గొలుసుతో కట్టి ఉంచాడు. చిన్నప్పటి నుంచి విచ్చలవిడిగా తిరగడానికి అలవాటు పడ్డ కుక్క బంధీగా ఉండలేకపోయింది. 


గొలుసు కట్టును తెంపుకోవడానికి శత విధాల ప్రయత్నించింది. గోలగోల చేసింది. కుక్క అరుపులను భరించలేకపోయారు ఆదయ్య దంపతులు.


“మప్పు కుంటే తిప్పుకోలేము” అంటే విన్నావు కావు. ఇప్పుడు మన మీదకే తిరగబడుతోంది దానిని బయటికి పంపించు” అని మొరపెట్టుకుంది ఆదమ్మ. 


కర్ర పట్టుకుని కుక్కని వెంట తరిమాడు ఆదయ్య. కాసేపటి తర్వాత మళ్ళీ ఇంటి ముందు ప్రత్యక్షమయింది కుక్క. అలా ఆనాటి నుంచి ఈ సామెత వాడుకలోకి వచ్చింది.


మనిషైనా,పక్షి అయినా జంతువైనా, మనం చేసే అలవాటుబట్టే ఉంటుంది. గొప్పలకు పోయి, అతి గారాబంతో లేని అలవాట్లు చేసి తర్వాత బాధపడి ఏమీ ఉపయోగం లేదు” అని మందలించాడు రాజా రావు.


తమ తప్పును తెలుసుకున్న వినీల, వినీత్ తమ కొడుకుతో స్నేహపూర్వకంగా ఉంటూ వైద్యుని పర్యవేక్షణలో మందులు వాడి కొడుకుని ప్రయోజకుడిగా తీర్చిదిద్దారు.


***


పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం

Patrayudu kasi viswanadham


విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ., 

ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).

స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం 

విజయనగరం జిల్లా.

నివాసం : శృంగవరపుకోట (ఎస్‌.కోట)

వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం) 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.


ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు  రాయడం 


ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.


సేకరణలు:

**********

1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్‌ వర్క్‌ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి  విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.


విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:

*******************************

1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.


2.మండలస్థాయిలో విద్యార్థులకు  *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.

3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.


బాల రచయితలుగా తీర్చిదిద్దడం

*******************************

బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.

నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో  10 కి పైగా ప్రచురించబడ్డాయి.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


సంకలనాలు :


1.గురజాడ శతవర్ధంతి

కవితా సంకలనం లో  

2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని'         సంకలనం లో 

3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల    సంరక్షణ',

4.'రక్త బంధం', 

5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.

6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల           బంధం' సంకలనం లో 

7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో

9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో 

10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో 

11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో

12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో

13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.

🌷🌷🌷🌷🌷🌷🌷


బహుమతులు

1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016

2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.

3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.

4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో  అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018

7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.

8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి

9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.

ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు. 


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


బిరుదులు : 

1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర, 

2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర, 

3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల, 

4.శతశ్లోక కంఠీరవ, 

5.సూక్తిశ్రీ, 

6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"

7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016

8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.

9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్‌ పురస్కారం 2017,

10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో

11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.

12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023



🌹🌹🌹🌹🌹🌹🌹

ముద్రించిన పుస్తకాలు :


1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),

2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).

3.*దేవునికో ఉత్తరం*  బాలల కధా సంపుటి

4.*అద్భుతం* బాలల కథా సంపుటి

5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.

6.తాతయ్య కల బాలల కథా సంపుటి.

అముద్రితాలు


1*మౌనమేలనోయి* కథల సంపుటి

2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి

3*నీకోసం* భావ కవితా సంపుటి.

4చెట్టు కథలు

5 పేదరాశి పెద్దమ్మ కథలు

6 మృగరాజు సందేశం కథల సంపుటి


ఇష్టాలు


పిల్లలతో గడపడం

బాలసాహిత్య పఠనం

బాలసాహిత్య రచన


ప్రచురణలు


ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల  పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120,  ప్రచురణ అయ్యాయి.

 

🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷

 




25 views1 comment

1 Comment


vani gorthy

•3 hours ago

🎉🎉🎉🎉🎉


Like
bottom of page