top of page

తరచిచూడు వింతలెన్నో!

Writer: A . Annapurna A . Annapurna

#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #TharachiChuduVinthalenno, #తరచిచూడువింతలెన్నో, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Tharachi Chudu Vinthalenno - New Telugu Poem Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 11/02/2025

తరచిచూడు వింతలెన్నో!తెలుగు కవిత

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


ఎరువువేసి నీరుపోసి పెంచిన మొక్కలు సుగంధాలతో పూలు పూస్తాయి 

ఎడారి ఇసుకలో ముళ్లపొదల్లో కఠినమైన రాళ్ళలోను పూలు ఎన్నో పూస్తాయి

ఎవరో అంటారు పూజకి పనికిరావని అది నాకు నచ్చదు ప్రకృతిలో పనికిరానివిలేవు 

ఎల్లరి మనసులను రంజిపచేస్తాయి అందానికి తీసిపోవు ప్రేమించే మనసుకి ఊరట నిస్తాయి


అగాధమైన సాగరంలో వెలలేని ముత్యాలు రూపుదిద్దుకుంటాయి ఎన్నో ఆకృతుల్లో మెరుస్తాయి

అతివల మెడలో వొదిగిపోతాయి వాటివిలువ హారములో పొదిగే వారికి తెలుసు

ఆ నగలు ధరించిన మగువకు ఆనందాన్ని పంచుతాయి అందాన్ని పెంచుతాయి

అతి తేలికైన ముత్యం పసిడిని భరించలేదు కల్మషంలేని మనసుకి అంకితం అవుతుంది


చందమామ స్వచ్ఛమైన వెన్నెలను తోడుగా తెస్తాడు ప్రపంచానికి వెలుగు పంచుతాడు

చల్లగాలితో చెలిమి చేస్తాడు తెల్లని తెలుపును పిండిలా ఆరబోస్తాడు మల్లి పొదలో మాటువేసేడు

చక్కని చుక్కలను కనబడనీయక మంచుతెర మాటున దాచేసి స్వంతం చేసుకుంటాడు

చలిగాలుల వలవేసి ప్రియులను మై మరపిస్తాడు చెలులను వలపు కౌగిట్లో బందీని చేస్తాడు 


వసంతకాలం రాగానే కోయిల పాటలు పాడి తన ప్రతిభను చాటుకుంటుంటుంది

వెన్నెల వెండి పరదాలు దింపి పారిజాత సుమాల పాన్పును తయారుచేస్తుంది 

వసివాడని పూవులతో తోరణాలు అల్లుతుంది పరిమళాల అత్తరును జల్లుతుంది

వనమంతా మిణుగురు దీపాలతో అలంకారాలు చేస్తుంది గోరింకలను విందుకు పిలుస్తుంది 


కలువపూల కొలనులో అందాల సుమ బాలల పాదాలకు సింధూరపు పారాణిపూసింది 

కన్నె కలువ కాటుక కన్నులలో ప్రతిబింబమై మెరిశాడు వెన్నెలరేడు

కలువకన్నె కౌగిలికై నిశిరాత్రి దాకా వేచివున్నాడు మబ్బుల్లో మాటువేశాడు

కలలు కంటున్న ముగ్ధ కలువ నిద్రమత్తులోనే నలిగి సొమ్మసిల్లిపొఇంది 

 

నింగిలోని జాబిల్లి తొంగిచూడగానే కనులు తెరచి సిగ్గుపడింది కలువ చెలి

నీటిలో రోజంతా జలకాలు ఆడినా అలసి సొలసి బడలికతో వడలిపోఇన్ది 

నింగిలో మబ్బులు కమ్ముకురాగా దిగులుపడిపొఇంది వెన్నెలరేడు రాడేమో అని 

నిర్మలమైన ఆకాశంనుంచి అర్ధరాత్రి వేళా దిగివచ్చి ఎదపై పవ్వళించగా గాఢంగా అదుముకుంది

నింగిలో దినకరుని కిరణాలు తూణీరాలై గుచ్చుకోగా కౌగిలి సడలించి జారుకున్నాడు జాబిల్లి. 

**************************************************************************


 ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)





コメント


bottom of page