Profile
About
నేను గుంటూరుకు చెందిన తెలుగు నాటక మరియు కథా రచయితను. నా తొలి రచన నా 8వ ఏట ప్రారంభించాను. నా తండ్రి సూర్యనారాయణ ప్రోత్సాహంతో అనేక పత్రికలకు రచనలు పంపటం జరిగింది. అలా వాటిలో కొన్ని ప్రచురణకు నోచుకున్నాయి. చిన్నపిల్లల కథలు కూడా రాయటం జరిగింది. అవి కూడా అనేక మాసపత్రికల్లో ప్రచురితమయ్యాయి. అటుపై తెలుగు నాటక సాహిత్యాన్ని నేర్చుకొని నాటక ప్రక్రియలో కొనసాగటం జరిగింది. అనేక నాటక పరిషత్తులలో ఉత్తమ రచయితగా బహుమతులు పొందటం జరిగింది. నేను రాసిన ‘‘శ్రీ గురురాఘవేంద్రచరితం’’ పద్యనాటకానికి రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం చే నంది అవార్డు పొందటం జరిగింది. పలు కథలు పలు మాసపత్రికల్లో ప్రచురణకు నోచుకున్నాయి. అటుపై 2015లో దూరదర్శన్ సప్తగిరిలో వెలుగునీడలు అనే టీవీ సీరియల్ కి కథను అందించాను. పలు టీ.వీ ఛానల్స్ లో సీరియల్స్ కి మాటల రచయితగా కూడా కొనసాగాను. కొన్ని సినిమాలకు రచనా సహకారం అందించాను.